ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైన్ షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా స్ధానికుల రాస్తారోకో

ABN, First Publish Date - 2021-12-12T22:18:26+05:30

ప్రశాంతంగా వున్న అపార్టమెంట్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే స్ధానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రశాంతంగా వున్న అపార్టమెంట్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే స్ధానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముషీరాబాద్ సమీపంలో జయదుర్గ అపార్టమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ అదే అపార్టమెంట్ వాసులతో పాటు,పరిసర ప్రాంతాల్లోని జయలక్ష్మి అపార్ట్ మెంట్, సమీపంలోని కృష్ణానగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు కాలనీలకు చెందిన పరుషులు, మహిళలు, యువతీ యువకులు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు.


ప్రశాంతంగా వున్న కాలనీల మధ్య వైన్ షాపు ఏర్పాటు చేస్తే ప్రశాంతతకు భంగం కలుగుతుందని, తరచూ గొడవలతో ఈ ప్రాంతంలో భద్రత కరువవుతుందని స్థానికులు ఆందోళన వక్తం చేశారు.ముఖ్యంగా యువత పెడదారిపట్టే ప్రమాదం వుందని కాలనీ వాసులు చెబుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని మా కాలనీల ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-12-12T22:18:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising