రసమయి సంచలన వ్యాఖ్యలు.. టీఆర్ఎస్లో జోరుగా చర్చ
ABN, First Publish Date - 2021-01-25T18:03:36+05:30
సోమవారం మహబూబాబాద్లో ప్రముఖ కవి జయరాజు తల్లి సంతాప సభలో మాట్లాడిన ఆయన.. తాను అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో
మహబూబాబాద్: సమాజంలో కవులు, కళాకారులు మౌనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదకరమంటూ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మహబూబాబాద్లో ప్రముఖ కవి జయరాజు తల్లి సంతాప సభలో మాట్లాడిన ఆయన.. తాను అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో తన సహజత్వాన్ని కోల్పోయానన్నారు. ప్రస్తుతం తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానంటూ సంచలనం సృష్టించారు. తాను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో చాలా మందికి దూరమయ్యానన్నారు.
ఎమ్మెల్యే రసమయి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వ పథకాలను, సీఎం కేసీఆర్ను ప్రశంసిస్తూ అసెంబ్లీలో సైతం తన పాటలతో దుమ్ములేపిన రసమయి.. ఇప్పుడిలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చాలా మందికి తాను దూరమయ్యారంటూ వ్యాఖ్యానించడం దేనికి సంకేతమన్న చర్చ జరుగుతోంది.
Updated Date - 2021-01-25T18:03:36+05:30 IST