పోలీసు శాఖ ఆధ్వర్యంలో 20 నుంచి వాలీబాల్ టోర్నీ
ABN, First Publish Date - 2021-10-17T04:50:29+05:30
పోలీసు శాఖ ఆధ్వర్యంలో 20 నుంచి వాలీబాల్ టోర్నీ
ఆమనగల్లు: పోలీసు అమరుల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20, 21 తేదీల్లో ఆమనగల్లు సర్కిల్ ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవి ఫంక్షన్హాల్లో రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తామని సీఐ జాల ఉపేందర్ శనివారం తెలిపారు. విజేతలకు రూ.20వేలు, రెండో బహుమతి రూ.10వేలు, మూడో బహుమతి రూ.5వేలు ఇస్తామన్నారు. ఈ నెల 19 నుంచి 21 వరకు మండల పరిషత్ ఆవరణలో షాద్నగర్ డివిజన్ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహిస్తామన్నారు. విజేతకు రూ.5,116, రన్నర్స్కు రూ.3,116, మూడో బహుమతి రూ.2,116 ఇస్తామని తెలిపారు. క్రీడాకారులు తమపేర్లను నమోదు చేయించుకునేందుకు 9652094142, 9848833838, 9440862884, 8374651316 నెంబర్లలో సంప్రదించాలని సీఐ కోరారు. సమావేశంలో ఎస్ఐ ధర్మేశ్, హరిశంకర్గౌడ్, వరప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-17T04:50:29+05:30 IST