ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పించుకున్న దారిదోపిడీ ముఠా సభ్యుడిని పట్టుకున్న గ్రామస్థులు

ABN, First Publish Date - 2021-10-30T04:46:19+05:30

తప్పించుకున్న దారిదోపిడీ ముఠా సభ్యుడిని పట్టుకున్న గ్రామస్థులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవాబుపేట: ఇటీవల దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాలో ఆరుగురు ముఠాసభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా అందులో నుంచి ఓముఠా సభ్యుడు పారిపోవడంతో పోలీసులు అక్కడక్కడా చెక్‌పోస్టులు నిర్వహించి తనిఖీలు నిర్వహించారు. తప్పించుకున్న ముఠా సభ్యుడు శుక్రవారం శంకర్‌పల్లి మండలంలోని అలా్ట్ర టెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ పత్తేపూర్‌ గ్రామస్థులకు కనిపించాడు. అప్రమత్తమైన గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని శంకర్‌పల్లి పోలీసులకు అప్పగించాడు. విషయం తెలుసుకున్న మండలప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో దారిదోపిడీలు జరుగుతున్న సంఘటనలు విని రాత్రి 7గంటలు దాటితే ఈమార్గం గుండా బయటకు వెళ్లాలంటే భయాందోళనకు గురయ్యేవారిమని ముఠా అరెస్టుతో ఉపశమనం లభించిందని గ్రామస్థులు తెలిపారు. దోపిడీలకు పాల్పడ్డ ముఠాసభ్యులను కఠినంగా శిక్షించాలని మండల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2021-10-30T04:46:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising