ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2.52లక్షల పశువులకు వ్యాక్సినేషన్‌ లక్ష్యం

ABN, First Publish Date - 2021-10-28T04:24:12+05:30

2.52లక్షల పశువులకు వ్యాక్సినేషన్‌ లక్ష్యం

సమీక్షలో మాట్లాడుతున్న సదానందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు రూరల్‌: గాలికుంటు వ్యాధి నివారణకు వికారాబాద్‌ జిల్లాలో 52 టీంల ద్వారా పశువులకు వ్యాక్సిన్‌ వేస్తున్నామని జిల్లా పశు సంవర్ధ్దకశాఖ అధికారి సదానందం తెలిపారు. బుధవారం తాండూరు మండలం జినుగుర్తి, బషీరాబాద్‌ మండలం కాశీంపూర్‌ గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం తాండూరు పశుసంవవర్దక శాఖ కార్యాలయంలో గాలికుంటు వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్‌కు సంబంధించి జూనియర్‌ పశుసంవర్దక శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 2.52లక్షల పశువులకు వ్యాక్సిన్‌ వేయాల్సి ఉండగా,  ఇప్పటి వరకు 92వేల  జీవాలకు టీకాలు వేయడం జరిగిందన్నారు. వచ్చేనెల 17 నాటికి లక్ష్యం పూర్తి చేస్తామన్నారు. వికారాబాద్‌ జిల్లాలో 95 పశుసంవర్దక కేంద్రాలుండగా వాటిలో 58 ఉపకేంద్రాలున్నాయన్నారు. 37 మంది జూనియర్‌ వెటర్నరీఅధికారులున్నారని పేర్కొన్నారు. రైతులు తప్పకుండా  పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్‌ నిజానంద్‌, హతిరామ్‌, సరిత పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T04:24:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising