ట్రెయినీ అధికారుల పర్యటన పూర్తి
ABN, First Publish Date - 2021-03-21T05:41:54+05:30
ట్రెయినీ అధికారుల పర్యటన పూర్తి
- గ్రామీణుల స్థితిగతులపై అధ్యయనం
- ప్రజలతో ఆడిపాడిన ట్రెయినీ ఐఏఎస్లు
మోమిన్పేట: గ్రామీణ ప్రాంతాల ప్రజల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఆరు రో జులుగా టేకులపల్లి, సుద్దోడ్కతండాలో పర్యటిస్తున్న ట్రెయినీ సర్వేంట్ ఆఫీసర్ల పర్యటన శని వారం ముగిసింది. వారు ప్రజలతో మమేక మై వ్యవసాయ ఆదాయం, ఆచార సంప్రదాయాలు, ప్రభుత్వాల సంక్షేమ పథకాల వర్తింపు తదిత రాలపై తెలుసుకున్నారు. ట్రెయినీ ఐఏఎస్లు పిరాయిసుడాన్, సంతోష్కుమార్, అనిత, రుజుత మాట్లాడుతూ.. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రి సోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఐఏ ఎస్ ట్రెయినింగ్ కోసం టేకులపల్లికి వచ్చినట్టు తెలిపారు. వారికి సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్రె డ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ రాయి స్, కార్యదర్శి వెంకటయ్య, గ్రామస్థులు సహకారం అందించారు. ట్రెయినీ ఐఏఎస్లను రైతువేదికలో సన్మానించారు. వార్డుసభ్యులు సరిత, వీ రమణి, వెంకటేషం, బేగం, శాంతబాయి, రాములు, రాజు, హెచ్ఎం సమ్మ య్య, మోహన్రెడ్డి, రాఘవేందర్, రాందాస్, ఖదీర్, సుభాన్రెడ్డి, మాణిక్యం, రఘునాథ్రెడ్డి, సత్యనారాయణ, రవీందర్రెడ్డి, పరశురాంగౌడ్, నవీ న్, మల్లారెడ్డి పాల్గొన్నారు.
సాల్వీడ్ గ్రామంలో...
కులకచర్ల: సాల్వీడ్లో సివిల్ సర్వీస్ ట్రైనీ అధికారులు పర్యటించారు. ప్రభుత్వ పథకాల అమలుపై తెలుసుకున్నారు. వారిని పరిగి బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు కె.నరేంద్రయాదవ్, గ్రామస్థులు సన్మానించారు.
Updated Date - 2021-03-21T05:41:54+05:30 IST