మెట్లకుంటలో వ్యక్తి దారుణహత్య
ABN, First Publish Date - 2021-03-02T05:13:35+05:30
మెట్లకుంటలో వ్యక్తి దారుణహత్య
- మొండెం నుంచి తలను వేరు చేసిన దుండగులు
బొంరాస్పేట్ : మండల పరిధిలోని మెట్లకుంటలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన కుర్వచంద్రయ్య (50) ఆదివారం రాత్రి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. గుర్తుతెలియని దుండగులు అతడిని హత్యచేసి మొండెం నుంచి తలను వేరు చేశారు. మొండాన్ని కట్ట వెనక భాగంలో పడేసి తలను తీసుకువెళ్లి పక్కనే ఉన్న నీటి గుంతలో పడేశారు. చంద్రయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా సోమవారం సాయంత్రం మొండెం, తలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.
Updated Date - 2021-03-02T05:13:35+05:30 IST