ఎమ్మెల్యే చొరవతో గోదాంలకు చేరిన ధాన్యం
ABN, First Publish Date - 2021-06-18T05:23:23+05:30
ఎమ్మెల్యే చొరవతో గోదాంలకు చేరిన ధాన్యం
దౌల్తాబాద్ : ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చొరవతో రైతులకు ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యాన్ని గోదాంలకు తరలిస్తున్నామని మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ భీములు అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్రకల్, దౌల్తాబాద్ మహిళా సమాఖ్య ఆవరణలో గల గోదాంలను ఆయన పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని మిల్లర్లకు తరలిస్తున్నామని ఆయన తెలిపారు. ఆయనవెంట టీఆర్ఎస్ నాయకులు టీటీ రాములు, ఏపీయం శ్రీనివాస్, సీసీలు హరినారాయణ, రైతులు ఉన్నారు.
Updated Date - 2021-06-18T05:23:23+05:30 IST