ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-02-28T05:03:36+05:30
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
కొత్తూర్: అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు తాళలేక చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తూర్ పోలీ్సస్టేషన్ పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక హెడ్కానిస్టేబుల్ సంపత్ కథనం ప్రకారం...ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన మారమోని మల్లేష్ (58) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్ధిక ఇబ్బందులకు గురైనాడని పేర్కొన్నారు. జీవితం మీద విరక్తి చెందిన మల్లేష్ గ్రామ శివారులోని విన్సిటీ రియల్వెంచర్లోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని శవ పరీక్ష కోసం షాద్నగర్ కమ్యూనిటీ అసుపత్రికి తరలించారు. మృతుని భార్య యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ సంపత్ తెలిపారు.
Updated Date - 2021-02-28T05:03:36+05:30 IST