ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్ల అనుమతితోనే మత్తుమందులు విక్రయించాలి

ABN, First Publish Date - 2021-10-29T05:21:03+05:30

డాక్టర్ల అనుమతితోనే మత్తుమందులు విక్రయించాలి

సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ కుషాల్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌ రూరల్‌: క్వాలిఫైడ్‌ డాక్టర్ల అనుమతితో నే మత్తు కలిగించే మందులు విక్రయించలని షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌ తెలిపారు. పట్టణంలో ఓ ఫంక్షన్‌ హాల్లో గురువారం మెడికల్‌ షాపుల యజమానులు, డీలర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. యువకులు మత్తుకు అలవాటు పడి గంజాయి, డ్రగ్స్‌ దొరక్కపోవడంతో మత్తు కోసం మెడికల్‌ షాపుల్లో డైజోఫామ్‌, అల్ఫాజోలం, దగ్గు మందుల కు అలవాటు పడుతున్నారని పేర్కొన్నారు. మత్తు మందు క్వాలిఫైౖడ్‌ డాక్టర్ల ప్రిస్ర్కిషన్‌ ఉంటేనే ఇవ్వాలని సూచించారు. మత్తు కలిగించే మందులు ఇస్తే కచ్చితంగా రిజిష్టర్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన యువత మత్తుకు అలవాటు పడి మత్తు కలిగించే మందులను మెడికల్‌ షాపుల్లో కొంటున్నారని తెలిపారు. సమావేశంలో డీఐలు అంజుమ్‌ అబిదా, రాజు, శైలజారాణి, ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌, మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీరభద్రప్ప, యశ్వంత్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising