శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి
ABN, First Publish Date - 2021-04-19T04:17:34+05:30
శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి
- జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టి. ఆచారి
మహేశ్వరం : హైందవ సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజ్ను ఆదర్శంగా తీసుకుని యువత దేశ భవిష్యత్తుకు బాటలు వేయాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టి.ఆచారి పిలుపునిచ్చారు. ఆదివారం మహేశ్వరం మండలం ఘట్టుపల్లి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డితో కలిసి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆచారి మాట్లాడుతూ దేశంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, కుహనా మేధావులు, సెక్యులరిజం పేరుతో హిందూమతాన్ని అవహేళన చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహాలను ఆవిష్కరించి అఖండ భారత్ నిర్మాణంలో భాగం కావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పాపయ్యగౌడ్, అనంతయ్యగౌడ్, జంగయ్యయాదవ్, మిద్దె సుదర్శన్రెడ్డి, మద్ది రాంరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు ఎస్. మాధవాచారి, కుండె వెంకటేష్, పి. సుదర్శన్యాదవ్, దేశ్యానాయక్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-19T04:17:34+05:30 IST