Telangana: భార్య చనిపోవడంతో కొడుకులు పట్టించుకోవడం లేదంటూ...
ABN, First Publish Date - 2021-12-13T13:25:28+05:30
జిల్లాలోని రాజేంద్రనగర్లో విషాదం చోటు చేసుకుంది. హైదర్గూడ గుమ్మకొండ కాలనీలో రాంబాబు అనే వృద్దుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్లో విషాదం చోటు చేసుకుంది. హైదర్గూడ గుమ్మకొండ కాలనీలో రాంబాబు అనే వృద్దుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కూల్డ్రింక్లో విషం కలుపుకొని సేవించి రాంబాబు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్య చనిపోయిన తరువాత తన కొడుకులు సరిగ్గా చూడడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-12-13T13:25:28+05:30 IST