మెరుగైన వైద్య సేవలందించాలి
ABN, First Publish Date - 2021-07-24T04:52:51+05:30
మెరుగైన వైద్య సేవలందించాలి
- డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి
కందుకూరు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి కృషి చేయాలని డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి వైద్యసిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని తనిఖీ చేశారు. ప్రతినెలా 25 ప్రసవాలు చేయాల్సి ఉండగా జూలైలో కేవలం నలుగురికి మాత్రమే చేసినట్లు సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. అలాగే రాచులూరు, లేమూరు గ్రామాల్లోని పీహెచ్సీల్లో గర్భిణులకు వైద్యపరీక్షలు చేయడానికి కృషిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సీహెచ్వో రవీందర్, శ్రీనివాస్, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-24T04:52:51+05:30 IST