మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం
ABN, First Publish Date - 2021-12-08T05:35:32+05:30
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం
- ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్
ఆమనగల్లు: మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రక్షణకు రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ అన్నారు. పట్టణంలోని కళ్యాణి గార్డెన్లో మంగళవారం లబ్ధిదారులకు సాయంత్రం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ హాజరై వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గంప వెంకటేశ్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ తోట గిరియాదవ్, తహసీల్దార్ పాండు నాయక్లతో కలిసి 59మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సీఐ జాల ఉపేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్ రావు, దుర్గయ్య, దోనాదుల కుమార్, పత్యనాయక్, శ్రీను, లచ్చి, తులసీరామ్ నాయక్, నిట్ట నారాయణ, సోని జయరామ్, రూపం వెంకట్రెడ్డి, కమటం రాధమ్మ వెంకటయ్య, గుత్తి బాలస్వామి, సయ్యద్ఖలీల్, గండికోట శంకర్, ఎనుముల రమేశ్, ఇర్ష్యద్ పాల్గొన్నారు. అదేవిధంగా తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు రూ.4.70లక్షలు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆయన నివాసంలో చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, విజయ్గౌడ్, గోవర్దన్, బాలస్వామి, రవీందర్, గోపీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-08T05:35:32+05:30 IST