లాక్డౌన్ నిబంధనలను గాలికొదిలేసిన పరిగి ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2021-05-18T17:06:34+05:30
పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి లాక్డౌన్ నిబంధనలను గాలికొదిలేశారు.
వికారాబాద్: పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి లాక్డౌన్ నిబంధనలను గాలికొదిలేశారు. ఉదయం పది దాటినా పట్టించుకోని ఎమ్మెల్యే తన కార్యకలాపాలను కొనసాగించారు. దోమ మండల కేంద్రంలో ఉదయం పది తర్వాత కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. చెక్కుల కోసం వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు గుమిగూడారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - 2021-05-18T17:06:34+05:30 IST