ఈటలను కలిసిన ముదిరాజ్ నాయకులు
ABN, First Publish Date - 2021-05-09T05:07:04+05:30
ఈటలను కలిసిన ముదిరాజ్ నాయకులు
కొడంగల్: కొడంగల్ నియోజకవర్గంలోని ముదిరాజ్ సంఘం నాయకులు శనివారం మాజీ మంత్రి ఈటల రాజేందర్ను కలిశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం సమంజసం కాదన్నారు. తాము ఈటల వెంటే ఉంటామని చెప్పారు. ఈకార్యక్రమంలో బాల్రాజ్, నర్సిములు, ఎంట్లమల్లయ్య, రాములు, సాయిలు, సత్యపాల్, అనంతయ్య, బాబయ్యనాయుడు, పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-05-09T05:07:04+05:30 IST