శభా్ష..మణిసాయి
ABN, First Publish Date - 2021-10-26T04:24:37+05:30
శభా్ష..మణిసాయి
- ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
తాండూరు: తాండూరు పట్టణానికి చెందిన మైక్రోఆర్టిస్టు మణిసాయి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పెన్సిల్ లిడ్పై తెలంగాణ కేబినెట్ మంత్రుల పేర్లను చెక్కాడు. మొత్తం 304 అక్షరాలను రాసి రికార్డు సృష్టించాడు. ప్రపంచరికార్డు కోసం ఆగస్టులో తెలంగాణ మంత్రుల పేర్లను పెన్సిల్ లిడ్పై రాసి మణిసాయి దరఖాస్తు చేసుకున్నాడు. సోమవారం వరల్డ్బుక్లో చోటు కల్పిస్తూ మణిసాయికి కొరియర్ ద్వారా సర్టిఫికెట్, మెడల్ అందింది. గతంలో మైక్రోఆర్టిస్టు మణిసాయి పెన్సిల్లిడ్పై జాతీయజెండా, శివాజిబొమ్మ, వీఐపీల పేర్లను రూపొందించాడు.
Updated Date - 2021-10-26T04:24:37+05:30 IST