రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2021-01-27T05:54:28+05:30
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయపోల్ రోడ్డులో మంగళవారం ఉదయం కారు.. బైక్, సైకిల్ను ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతిచెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తలకునూరుకు చెందిన జెర్రిపోతుల నరేష్( 26), విష్ణు ఇబ్రహీంపట్నం నుంచి తూప్రాన్పేట్ వైపు బైక్పై వెళ్తున్నారు. అదే దారిలో రాంవిలాస్, దినకర్ రాములు సైకిల్పై వెళ్తున్నారు. ఎదురుగా దండుమైలారం నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్న బైక్ను, సైకిల్నుడీకొంది. నరేష్, విష్ణు, రాంవిలా స్, రాములు గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా నరేష్ మృతిచెందాడు. ముగ్గురు చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామస్వామి తెలిపారు.
Updated Date - 2021-01-27T05:54:28+05:30 IST