ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రజల గొంతుకనవుతా
ABN, First Publish Date - 2021-02-28T05:57:49+05:30
ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రజల గొంతుకనవుతా
- స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్
ఆమనగల్లు : ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పిస్తే ఉద్యోగుల, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల గొంతుకనై, వారి సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం కొనసాగిస్తానని రంగారెడి-హైద్రాబాద్-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో శనివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, మేథావులు, యువకులతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం మాత్రం ఉద్యోగాల భర్తీ విషయంలో తప్పుడు లెక్కలు చూపుతోందని అన్నా రు. కార్యక్రమంలో ఆంజనేయులు, భగవంత్ రాజు, రాములయ్య, నాగేం ద్రం, పురుషోత్తంరెడ్డి, మణిపాల్రెడ్డి, రాములు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-02-28T05:57:49+05:30 IST