ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చర్లపల్లి’లో జైల్‌ అదాలత్‌

ABN, First Publish Date - 2021-07-25T05:18:09+05:30

‘చర్లపల్లి’లో జైల్‌ అదాలత్‌

అదాలత్‌లో పాల్గొన్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుషాయిగూడ  : చర్లపల్లి కేంద్ర కారాగారంలో శనివారం నిర్వహించిన ‘జైల్‌ అదాలత్‌’లో 320 కేసులు పరిష్కరించగా,  280 మంది ఖైదీలకు విముక్తి లభించింది. చంచల్‌గూడకు చెందిన 23 ఖైదీలు, స్పెషల్‌ ప్రిజన్‌ ఫర్‌ ఉమెన్‌కి చెందిన ఆరుగురు మహిళా ఖైదీలు, సంగారెడ్డి జిల్లా జైలుకు చెందిన 28 మంది ఖైదీలకు సంబంధించిన కేసులు పరిష్కారమయ్యాయి. ఎల్‌బీనగర్‌, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌, మల్కాజిగిరి, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన వివిధ మెట్రోపాలిటన్‌ కోర్టులతో పాటు హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్‌, చేవెళ్ల సెషన్స్‌ కోర్టులకు సంబంధించిన కేసులను విచారించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అనుపమా చక్రవర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్‌కుమార్‌, ఆంజనేయులు పర్యవేక్షణలో మేజిస్ట్రేట్‌లు కె.కవిత, జి.కవిత, ఎ.నాగరాజు, బి.సంజయ్‌, కె.అజే్‌షకుమార్‌ తదితరులు కేసులను విచారించారు.

Updated Date - 2021-07-25T05:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising