ఈదమ్మ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం
ABN, First Publish Date - 2021-11-30T05:09:41+05:30
ఈదమ్మ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం
పరిగి: ఓ దేవాయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటన చోటుచేసుకుంది. పరిగి మండలం సయ్యద్మల్కాపూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 89లో ఉన్న ఈదమ్మ ఆలయలంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం అదే గ్రామానికి చెందిన లి ంగం వెళ్లి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. భూమి యజమాని రహింపటేల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు.
Updated Date - 2021-11-30T05:09:41+05:30 IST