కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
ABN, First Publish Date - 2021-04-24T04:12:52+05:30
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
- ఎంపీపీ కొప్పు సుకన్య భాషా
యాచారం : మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులు యాచారం, చింతపట్ల తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయుంచి లబ్ధి పొందాలని ఎంపీపీ కొప్పు సుకన్య భాషా అన్నారు. శుక్రవారం రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కె.జోగిరెడ్డిలతో కలిసి యాచారం, చింతపట్ల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించిందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవొద్దని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండ అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో మండల సహకార సంఘం చైర్మన్ టి.రాజేందర్రెడ్డి, చింతపట్ల సర్పంచ్ సరితా పాండురంగారెడ్డి, వ్యవసాయాధికారులు సందీ్పకుమార్, గురుప్రసాద్, గాయత్రి తదితరులున్నారు.
Updated Date - 2021-04-24T04:12:52+05:30 IST