నేడు మహేశ్వరంలో గవర్నర్ తమిళిసై పర్యటన
ABN, First Publish Date - 2021-07-12T13:21:26+05:30
రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఈరోజు మహేశ్వరంలో పర్యటించనున్నారు.
రంగారెడ్డి: రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఈరోజు మహేశ్వరంలో పర్యటించనున్నారు. ముందుగా శివగంగ రాజరాజేశ్వరస్వామిని గవర్నర్ దర్శించుకోనున్నారు. అనంతరం కేసీ తండా పల్లె పకృతి వనంలో గవర్నర్ తమిళిసై మొక్కలు నాటనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Updated Date - 2021-07-12T13:21:26+05:30 IST