పేద ప్రజలకు అండగా ప్రభుత్వం
ABN, First Publish Date - 2021-05-11T05:24:33+05:30
పేద ప్రజలకు అండగా ప్రభుత్వం
మొయినాబాద్ రూరల్: పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మొయినాబాద్ డిప్యూటీ తహసీల్దార్ తాజూద్దీన్ తెలిపారు. సోమవారం లబ్ధిదారులకు తన చాంబర్లో కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిపనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చిన చెక్కులను తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తున్నట్లు తెలిపారు. పండుగలకు ప్రభుత్వం పేద ప్రజలకు చేయుతనందిస్తుందని అన్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారు తమ పేర్లు ఉంటే కార్యాలయానికి వచ్చిన చెక్కులను తీసుకోవాలని తెలిపారు. ఆసిస్టెంట్ ప్రవీన్కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ సతీష్, యాదయ్య, సిబ్బంది ఉన్నారు.
Updated Date - 2021-05-11T05:24:33+05:30 IST