ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం

ABN, First Publish Date - 2021-12-01T05:19:29+05:30

పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం

ఆమనగల్లులో చెక్కులందజేస్తున్న ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు: గ్రామీణపేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం రూ.3.50 లక్షల విలువ గల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరేరాష్ట్రంలో లేనివిధంగా సీఎం సహాయనిధి ద్వారా పేదలకు ఆరోగ్య చికిత్సలకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, తోట గిరియాదవ్‌, దశరథ్‌ నాయక్‌, గంప వెంకటేశ్‌, గూడూరు లక్ష్మీనర్సింహ, బాలయ్య, నిట్ట నారాయణ, జోగు వీరయ్య, పత్యనాయక్‌, ప్రశాంత్‌ నాయక్‌, కృష్ణయ్య యాదవ్‌, తులసీరామ్‌ నాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T05:19:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising