చోరీలకు పాల్పడిన నలుగురి రిమాండ్
ABN, First Publish Date - 2021-05-11T05:18:58+05:30
చోరీలకు పాల్పడిన నలుగురి రిమాండ్
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయ పోలీ్సస్టేషన్ పరిధిలోని గగన్పహాడ్, సాతంరాయి గ్రామాల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన నలుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలిచారు. పోలీసులు తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి. గగన్పహాడ్, సాతంరాయి గ్రామాల్లో ఉండే గణేశ్, రాజు, నల్లూరి అఖిల్, ఎర్రోల్ల ఉదయ్కుమార్, గణేశ్ తమ రోడ్డుపక్కన పార్క్ చేసిన లారీల డ్రైవర్లు, క్లీనర్లను బెదిరించి డబ్బులు లాక్కొని పారిపోయేవారు. వీరు ఇటీవల ఓ లారీడ్రైవర్ను బెదిరించి వెయ్యిరూపాయలు లాక్కొని పోగా డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిఘా వేసి ఈ నలుగురినీ పట్టుకొని విచారించారు. వీరు గ్రామాల్లోనూ చోరీలు చేసిన విషయం బయటపడింది. నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. పరారీలో ఉన్న గణేశ్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Updated Date - 2021-05-11T05:18:58+05:30 IST