పరిశుభ్రత పాటించకుంటే జరిమానా
ABN, First Publish Date - 2021-02-28T05:02:53+05:30
పరిశుభ్రత పాటించకుంటే జరిమానా
జడ్పీ డిప్యూటీ సీఈవో జానకిరెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్ : పరిశుభ్రత పాటించని వారికి జరిమానాలు విధించాలని జడ్పీ డిప్యూటీ సీఈవో జానకిరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని పోచారం గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో కంపోస్టు యార్డు, పాఠశాల, అంగన్వాడీ భవనాలను పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలోని రికార్డులను, నర్సరీ, నాటిన మొక్కలను, ప్రభుత్వ భవనాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై ఖాళీ స్థలాల్లో చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయన వెంట ఎంపీడీవో మహేశ్బాబు, ఏపీవో లలిత, సర్పంచ్ ఓరుగంటి అరుణానరేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-02-28T05:02:53+05:30 IST