శిశువులకు కంటి స్ర్కీనింగ్ పరీక్షలు
ABN, First Publish Date - 2021-10-30T04:45:18+05:30
శిశువులకు కంటి స్ర్కీనింగ్ పరీక్షలు
శిశువుకు కంటిపరీక్షలు చేస్తున్న వైద్యులు
తాండూరు: తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నవజాత శిశువులకు కంటి స్ర్కీనింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు. అంధ త్వ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సికింద్రాబాద్ పుష్పగిరి కంటి ఆసుపత్రి ద్వారా జిల్లా ఆసుపత్రిలో నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు, బరువుతక్కువగా ఉన్న పసికందులకు కంటి సమస్యలు రాకుండా చికిత్సలు అందించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందికి కంటి పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. చిన్నారుల్లో అంధత్వ నియంత్రణకు పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
Updated Date - 2021-10-30T04:45:18+05:30 IST