పేలిన డిటొనేటర్లు
ABN, First Publish Date - 2021-12-02T05:09:14+05:30
పేలిన డిటొనేటర్లు
- పశువుల కొట్టం, రెండిళ్లు ధ్వంసం
- ఇద్దరికి గాయాలు
యాచారం: కొట్టంలో ఉన్న డిటొనేటర్లు పేలి పశువుల కొట్టం, రెండిళ్లు పాక్షికంగా ధ్వంసమై ఇద్దరికి గాయాలైన సంఘటన మల్కీజ్గూడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్లయ్య అనే రైతుకు చెందిన పశువుల కొట్టంలో బుధవారం రాజశేఖర్, లక్ష్మయ్య అనే యువకుల శుభ్రం చేసి చెత్తను జమచేసి నిప్పు పెట్టారు. అయితే చెత్తలో డిటొనేటర్లు ఉన్నట్టు వారు గుర్తించలేదు. మంటలకు డిటనేట ర్లు పేలి రాజశేఖర్, లక్ష్మయ్యకు గాయాలయ్యాయి. పశువుల కొట్టం, పక్కనే ఉన్న శ్రీను, ప్రభాకర్ అనే వ్యక్తుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. త్రుటిలో ప్రాణనష్టం తప్పింది. క్షతగాత్రులను మాల్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించారు. సంఘటనా స్థలాన్ని సీఐ లింగయ్య, ఎస్సై పద్మయ్య సందర్శించారు. తాను ఎలాంటి పేలుడు పదార్థాలను సరఫరా చేయడం లేదని, తన కొట్టంలోకి డి టోనేటర్లు ఎలా వచ్చాయో తెలియదని రైతు మల్లయ్య పోలీసులకు తెలిపాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-12-02T05:09:14+05:30 IST