సంక్షేమానికి కృషి : మంత్రి
ABN, First Publish Date - 2021-10-17T05:00:34+05:30
సంక్షేమానికి కృషి : మంత్రి
శామీర్పేట : రెడ్డిల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం శామీర్పేట గ్రామంలో రెడ్డిభవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెడ్డి భవన్ నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే దేవీనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శామీర్పేట్లోని దుర్గాదేవి మండపంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, డీసీఎంఎస్ వైస్చైర్మన్ మధుకర్రెడ్డి, జడ్పీటీసీ అనిత, ఎంపీపీ ఎల్లూబాయి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుదర్శన్, ఎంపీటీసీ సాయిబాబు, మూడుచింతలపల్లి మండలాధ్యక్షుడు మల్లే్షగౌడ్, సొసైటీ వైస్చైర్మన్ ఐలయ్యయాదవ్, మాజీ సర్పంచ్ కిషోర్యాదవ్ సొసైటీ డైరెక్టర్ భూమిరెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, తిరుపతిరెడ్డి, మతిన్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-17T05:00:34+05:30 IST