ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాగులో చేపల మృత్యువాత

ABN, First Publish Date - 2021-10-25T05:21:07+05:30

వాగులో చేపల మృత్యువాత

ఎన్కెపల్లి వాగులో మృతిచెందిన చేపపిల్లలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేవెళ్ల: గుర్తుతెలియని వ్యక్తులు వాగులో విష రసాయనాలు కలపడంతో వేలాది చేపలు మృతిచెందాయి. ఈ ఘటన ఎన్కెపల్లి వాగులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం రామన్నగూడ, న్యాలట, సింగప్పగూడ, కొత్తపల్లి, ఎన్కెపల్లి తదితర గ్రామాల మీదుగా వాగు ప్రవహిస్తోంది. ఈ వాగులోని నీరంతా శంకర్‌పల్లి మండలం మీదుగా గండిపేట్‌ చెరువుకు వెళ్తుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఎన్కెపల్లి సమీపంలో వాగులో క్రిమిసంహరక మందును పారబోసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాతపడ్డాయని వాపోయారు. ఈ నీరు పశువులు తాగినా చనిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. తాము సమాచారం ఇవ్వడంతో పోలీసులకు వచ్చి పరిశీలించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిఘా పెంయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - 2021-10-25T05:21:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising