క్రికెట్ టోర్నీ విజేత మంచాల
ABN, First Publish Date - 2021-10-20T05:01:09+05:30
క్రికెట్ టోర్నీ విజేత మంచాల
ఇబ్రహీంపట్నం: బంటి యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి బొంగులూరు జేబీ గ్రౌండ్స్లో జరిగిన క్రికెట్ టోర్నీలో మంచాల జట్టు విజేతగా, ఇబ్రహీంపట్నం జట్టు రన్నర్స్గా నిలిచాయి. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలు.. ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం, తుర్కలయంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ జట్లు పాల్గొన్నాయి. ఫ్లడ్ లైట్ల వెలుతురులో టోర్నీ నిర్వహించారు. ఎమ్మెల్యే కిషన్రెడ్డి టోర్నీని ప్రారంభించారు. ఏడు ఓవర్ల చొప్పున జరిగిన మ్యాచ్లతో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు ముగుశాయి. టీఆర్ఎస్ యువనేత మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి(బంటి) ట్రోఫీ బహుకరించారు. ఎంపీపీ కృపేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, జెర్కోని రాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-20T05:01:09+05:30 IST