ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా బీసీ గురుకుల కళాశాలల ప్రవేశపరీక్ష

ABN, First Publish Date - 2021-07-26T05:26:59+05:30

ప్రశాంతంగా బీసీ గురుకుల కళాశాలల ప్రవేశపరీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవో

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి): మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం జిల్లాలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం మొత్తం 1807మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1370 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 437 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు నిర్వహించేందుకు వికారాబాద్‌, పరిగి పట్టణాల్లో 11కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం 1549మందిని కేటాయించగా, వారిలో 1166మంది పరీక్షకు హాజరు కాగా, 383మంది గైర్హాజరయ్యారు. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు 258మందిని కేటాయించగా వారిలో 204 మంది హాజరు కాగా 54మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను డీఈవో రేణుకాదేవి, జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌ యాదయ్యగౌడ్‌, జిల్లా కన్వీనర్‌ శంకర్‌ తనిఖీ చేశారు.

Updated Date - 2021-07-26T05:26:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising