ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో బైక్‌తో ఢీ

ABN, First Publish Date - 2021-05-11T05:26:00+05:30

మద్యం మత్తులో బైక్‌తో ఢీ

మమత మృతదేహం వద్ద రోదిస్తున్న మహిళ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అక్కడికక్కడే యువతి మృతి

శంషాబాద్‌: శంషాబాద్‌ మున్సిపాలిటీ రాళ్లగూడ-దొడ్డి వద్ద సోమవారం బైక్‌ ఢీకొని యువతి మృతిచెందింది. వ్యక్తి మద్యం మత్తులో బైక్‌ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. చౌదరిగూడకు చెందిన మల్లేష్‌ శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మల్లేష్‌ బైక్‌పై చౌదరిగూడ నుంచి శంషాబాద్‌ వైపునకు వస్తూ రాళ్లగూడ-దొడ్డి వద్ద మమత(19) అనే యువతిని ఢీకొట్టాడు. తలకు గాయాలై మమత అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెకు కొన్ని నెలల క్రితమే పెళ్లయింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాద స్థలం నుంచి మల్లేష్‌ పారిపోయాడు. అతడిని వెతికి పట్టుకొని విచారించగా ప్రమాద సమయంలో మద్యం తాగినట్టు తేలిందని పోలీసు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-05-11T05:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising