ఉరివేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-12-06T20:17:06+05:30
రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధి శివరాంపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక అభిలాష్ (26) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధి శివరాంపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక అభిలాష్ (26) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివరాంపల్లి ఆదర్శనగర్ కాలనీలో కుటుంబ సభ్యులతో అవినాష్ ఉంటున్నారు. కాగా డిసెంబర్ 26 న అవినాష్ వివాహం నిశ్చయం అయింది. రూ.15 లక్షలు దాకా అవినాష్ అప్పుచేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2021-12-06T20:17:06+05:30 IST