ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న సిరిసిల్లలో తప్పించుకున్న చిరుత

ABN, First Publish Date - 2021-01-14T17:55:53+05:30

మాల్కపూర్‌లోని ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన చిరుత పులి తప్పించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయినపల్లి మండలం, మాల్కపూర్‌లోని ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన  చిరుత పులి తప్పించుకుంది. బావిలో బొరియ ఉండడంతో చిరుత ఆచూకి దొరకలేదు. హైదరాబాద్ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ రాత్రంతా బావివద్ద కాపలా కాసింది. బావిలోకి నిచ్చెనలు వేయడంతో పైకి వెళ్లి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. చిరుత మళ్లీ తప్పించుకోవడంతో  స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.


చిరుతను పట్టుకోవడం కోసం చేసిన ఆపరేషన్ కొంతవరకు సక్సెస్ అయినప్పటికీ మళ్లీ చిరుత తప్పించుకోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరుత తప్పించుకుని ఎక్కడికి వెళ్లిందన్నదానిపై పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. చిరుత అడుగు జాడలను పరిశీలించారు. అయితే ఈ పరిశీలనలో సంచలన విషయాలు తెలిసాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ ప్రాంతంలో మొత్తం నాలుగు చిరుత పులులు సంచరిస్తున్నాయని చెప్పారు. చుట్టుప్రక్కల గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Updated Date - 2021-01-14T17:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising