‘పల్లా’ ఓటమి చెంపపెట్టు కావాలి..
ABN, First Publish Date - 2021-03-01T04:00:53+05:30
‘పల్లా’ ఓటమి చెంపపెట్టు కావాలి..
టీజేఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం
ఖిలావరంగల్, ఫిబ్రవరి 28: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఓటమి సీఎం కేసీఆర్, కేటీఆర్లకు చెంపపెట్టు కావాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఓ సిటీ, ఖిలావరంగల్ వాకింగ్ గ్రౌండ్లలో ఆదివారం వాకర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. సమైక్య పాలకుల నుంచి తెచ్చుకున్న తెలంగాణలో ఏడేళ్లుగా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు లెక్కలు చూపుతున్నారన్నారు. చిల్లా రాజేంద్రప్రసాద్, దుర్గం సారయ్య పాల్గొన్నారు.
అధిక మెజారిటీతో గెలిపించండి
వడ్డెపల్లి: ప్రజల సమస్యలపై శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకను తానేనని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం హన్మకొండ వడ్డెపల్లి విజయపాల్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దొంతి సు దర్శన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించి సమావేశంలో ఆయన మాట్లాడారు. 1.30లక్షలు ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రజాసమస్యలపై అవగాహన లేద న్నారు. ఎర్రగట్టుస్వామి, రమణారావు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-01T04:00:53+05:30 IST