పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
ABN, First Publish Date - 2021-01-27T20:12:12+05:30
పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
హైదరాబాద్: పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేసింది. 7.5 శాతం ఫిట్మెంట్ ప్రతిపాదనపై ఉద్యోగులు మండిపడ్డారు. కనీస వేతనాన్ని రూ.19 వేలకు సిఫార్సు చేయడం సరికాదన్నారు. పీఆర్సీ ప్రతిపాదనలను ఎట్టిపరిస్థితిలో అంగీకరించమని ఉద్యోగ సంఘాలు తెలిపారు. పీఆర్సీ కమిషన్ సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనన్నారు. ఉద్యోగుల సమస్యలు వారికి కనిపించకపోవడం బాధాకరమన్నారు.
Updated Date - 2021-01-27T20:12:12+05:30 IST