ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్నిస్తాం: బండి సంజయ్

ABN, First Publish Date - 2021-07-30T21:44:28+05:30

ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్నిస్తాం: బండి సంజయ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్నిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. శాంతిభద్రతల పేరుతో బీజేపీ కార్యకర్తల్ని రాష్ట్రవ్యాప్తంగా అడ్డుకుంటున్నారని, పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని కేసీఆర్‌ ఎన్నోసార్లు అన్నారని బండి సంజయ్‌ విమర్శించారు. ఇప్పుడు అటవీసిబ్బందిని పంపి పంటలను నాశనం చేయిస్తున్నారని, ప్రభుత్వం పోడు భూముల సమస్యను పరిష్కరించాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో బైపోల్స్ కాదు.. కేసీఆర్‌కు బైయింగ్ ఎలక్షన్స్ అని సంజయ్‌ అన్నారు. పది కాదు.. ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వాలని సంజయ్‌ డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపును సీఎం కేసీఆర్ అడ్డుకోలేరని, దమ్ముంటే ఈటల బావమరిది చాటింగ్‌పై విచారణ జరిపించాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.


Updated Date - 2021-07-30T21:44:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising