బోయినపల్లి వ్యాక్సిన్ సెంటర్కు కరెంట్ కట్
ABN, First Publish Date - 2021-04-11T16:22:15+05:30
బోయినపల్లిలోని ప్రభుత్వ కరోనా టీకా సెంటర్ కరెంట్..
హైదరాబాద్/బోయినపల్లి : బోయినపల్లిలోని ప్రభుత్వ కరోనా టీకా సెంటర్ కరెంట్ బిల్ కట్టలేదని అధికారులు సరఫరా నిలిపివేశారు. దీంతో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. దాదాపు 3 గంటలపాటు కరెంట్ లేకపోవడంతో జనం చెట్లకింద కూర్చుని ఎదురుచూశారు. సహనం కోల్పోయి వాగ్వాదానికి దిగారు. బీజేపీ నాయకుడు జంపన ప్రతాప్, కపిల్, శంకర్ వచ్చి పరిశీలించారు. జంపన ప్రతాప్ సొంత డబ్బులతో బిల్ చెల్లించి, సరఫరా పునరుద్ధరింపజేశారు.
Updated Date - 2021-04-11T16:22:15+05:30 IST