ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కండువా లేని టీఆర్ఎస్ నాయకులుగా పోలీసులు: వివేక్

ABN, First Publish Date - 2021-01-19T18:47:51+05:30

జిల్లా పోలీసులపై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కండువా లేని టీఆర్ఎస్ నాయకులుగా పోలీసులు మారారని వివేక్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంచిర్యాల జిల్లా:  జిల్లా పోలీసులపై  మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  కండువా లేని టీఆర్ఎస్ నాయకులుగా పోలీసులు మారారని వివేక్ విమర్శించారు. మంగళవారం ఆయన బెల్లంపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నాయకుల చేస్తున్న అక్రమాలకు, అన్యాయాలకు, అవినీతికి  పోలీసులు వంతపాడుతున్నారన్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు జిల్లాలో చేస్తున్న భూకబ్జా, ఇసుక మాఫియాకు పోలీసులు సహకరిస్తూ అండగా ఉంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, విప్ అండతో నాయకులు జిల్లాలో  భూకబ్జాలు చేస్తున్నారన్నారన్నారు.





టీఆర్ఎస్ నాయకుల అండతోనే గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందన్నారు. దీంతో వారి అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరాయన్నారు. అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతోనే బీజేపీ నాయకులపై  పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు పెడితే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటికైనా పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలని వారికి ఆయన హితవు పలికారు. టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై పోరాడే కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు.

Updated Date - 2021-01-19T18:47:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising