4న జోడేఘాట్ నుంచి పోడుయాత్ర : చాడ
ABN, First Publish Date - 2021-07-27T08:50:46+05:30
పోడు సాగుదారులకు అండగా నిలిచేందుకు జోడేఘాట్ కుమ్రం భీమ్ స్థూపం నుంచి ఆగస్టు 4న పోడు యాత్ర’ ప్రారంభించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, జులై 26(ఆంధ్రజ్యోతి): పోడు సాగుదారులకు అండగా నిలిచేందుకు జోడేఘాట్ కుమ్రం భీమ్ స్థూపం నుంచి ఆగస్టు 4న పోడు యాత్ర’ ప్రారంభించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం మగ్ధుంభవన్లో పోడుయాత్ర పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ యాత్ర 8న భద్రాచలంలో ముగుస్తుందన్నారు. సీపీఐ ప్రతినిధి బృందం మంగళ, బుధవారాల్లో కృష్ణా జలాల ఆధారిత ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు తెలిపారు.
Updated Date - 2021-07-27T08:50:46+05:30 IST