నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
ABN, First Publish Date - 2021-11-28T14:17:21+05:30
నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించనున్నారు.
హైదరాబాద్: నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం విధానాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. కొత్త విద్యుత్ చట్టం, విభజన హామీలు, నీటి వాటాల అంశాలపై.. పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Updated Date - 2021-11-28T14:17:21+05:30 IST