‘రియల్’ ప్రయోజనం కోసమొస్తే.. గౌరవమే!: పల్లా
ABN, First Publish Date - 2021-01-24T08:24:20+05:30
‘‘రియల్ ఎస్టేటో మరేదైనా ఇతర రంగంలో లబ్ధి పొందాలనుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులైన వారికి గౌరవం తప్ప మరేదీ దక్కడం లేదు. అలాంటి వారికి ప్రభుత్వపరంగా ఏదైనా లబ్ధి చేకూరేలా కృషి చేస్తా’
కృష్ణకాలనీ (భూపాలపల్లి), జనవరి 23: ‘‘రియల్ ఎస్టేటో మరేదైనా ఇతర రంగంలో లబ్ధి పొందాలనుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులైన వారికి గౌరవం తప్ప మరేదీ దక్కడం లేదు. అలాంటి వారికి ప్రభుత్వపరంగా ఏదైనా లబ్ధి చేకూరేలా కృషి చేస్తా’ అని ఎ మ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. భూపాలపల్లి లో శనివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ పటిష్టత కోసం పా టుపడుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులు కా నీ, ప్రభుత్వం కానీ పట్టించుకోలేదనేది అవాస్తవమని అన్నారు. కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని, వారికి కూడా ప్రభుత్వం పరంగా లబ్ధి చేకూరేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకం కార్యకర్తల ప్రమేయం లేకుండా ప్రజలకు నేరుగా చేరేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అంతకు ముందు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2021-01-24T08:24:20+05:30 IST