ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలెం ప్రాజెక్టు ప్రధాన కాల్వకు గండి

ABN, First Publish Date - 2021-04-09T06:04:48+05:30

పాలెం ప్రాజెక్టు ప్రధాన కాల్వకు గండి

కాల్వకు గండిపడి వృథాగా పోతున్న నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాపురం(నూగూరు), ఏప్రిల్‌ 8: మండలంలోని బొల్లారం-యోగితానగర్‌ గ్రామాల మధ్యలో పాలెంవాగు ప్రాజెక్టు ప్రధాన కాల్వకు గండి పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రబీలో పాలెంవాగు ప్రాజెక్టు కింద నూగూరు, బర్లగూడెం, చిరుతపల్లి, మహితాపురం గ్రామాలకు చెందిన రైతులు వరిపంటను సాగుచేస్తున్నారు. పంటలకు నీళ్లు అందించేందుకు ప్రధాన కాల్వకు నీటిని అధికారులు విడుదల చేశారు. యోగితానగర్‌- బొల్లారం గ్రామాల మధ్యలో ప్రధాన కాల్వకు వర్షాకాలంలో గండిపడడంతో అధికారులు ఇసుక బస్తాలు వేసి గండిని పూడ్చారు.  ప్రధాన కాల్వకు నీళ్లు వదలడంతో తిరిగి అదే ప్రాంతంలో గండిపడి నీరు వృథాగా పోతోంది. దీంతో ప్రాజెక్టు కాల్వ కింద వరి పంట వేసిన బర్లగూడెం, రామవరం, చిరుతపల్లి, యోగితానగర్‌ గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత అధికారులు త్వరగా గండిని పూడ్చి పంట పొలాలకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు


Updated Date - 2021-04-09T06:04:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising