Nalgonda : పుల్లెంలలో ఆన్లైన్ మోసం
ABN, First Publish Date - 2021-09-18T14:00:37+05:30
చండూరు మండలం పుల్లెంలలో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. తల్లిదండ్రులు సెల్ఫోన్ను ఇంట్లో వదిలి పనికి వెళ్లారు.
నల్గొండ: చండూరు మండలం పుల్లెంలలో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. తల్లిదండ్రులు సెల్ఫోన్ను ఇంట్లో వదిలి పనికి వెళ్లారు. ఓ అపరిచత వ్యక్తి ఫోన్ చేయడంతో కూతురు లిఫ్ట్ చేసి ఓటీపీ చెప్పింది. దీంతో అకౌంట్లో ఉన్న రూ.3 లక్షలను క్షణాల్లో మాయం చేశాడు. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-09-18T14:00:37+05:30 IST