ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భైంసా అల్లర్లపై కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

ABN, First Publish Date - 2021-03-22T15:57:47+05:30

భైంసా అల్లర్లపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అల్లర్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: భైంసా అల్లర్లపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అల్లర్ల సందర్భంగా దాడులు, ఆస్తులను ధ్వంసం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వారియర్ తెలిపారు. సోఫియాన్, ముజమ్మిల్, నవాజ్, జుబేర్, ఔసాఫ్‌ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వారియర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఈ కేసులో నిందితులను ఉపేక్షించేది లేదన్నారు. ఈ కేసుతో సంబంధమున్న మరికొందరు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ వారియర్ తెలిపారు. 




భైంసాలో మార్చి 7వ తేదీన అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక వర్గంపై మరో వర్గం రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ అల్లర్లకు దారితీసినట్లుగా భావిస్తున్నారు. అల్లర్లకు సంబంధించి గతంలో 38 మందిని అరెస్టు చేశారు. భైంసాలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాదాపు 26 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో దాదాపు 66 మందిని బైండోవర్ చేశారు.  

Updated Date - 2021-03-22T15:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising