ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్లపల్లి జైలులో మరో ఖైదీ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-07-25T08:03:26+05:30

చర్లపల్లి కేంద్ర కారాగారంలో మరో ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల వ్యవధిలో జైలులో ఇద్దరు ఖైదీలు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడడం చర్చానీయంశంగా మారింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎ్‌సరావునగర్‌, జులై 24 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లి కేంద్ర కారాగారంలో మరో ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల వ్యవధిలో జైలులో ఇద్దరు ఖైదీలు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడడం చర్చానీయంశంగా మారింది. చర్లపల్లి బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన షేక్‌ ఖాజామియా(35) కుషాయిగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులో ఈ నెల 7 నుంచి రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. శనివారం ఉదయం అతను తన బ్యారక్‌లో బెడ్‌షీట్‌తో ఉరేసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని తోటి ఖైదీలు గమనించి, జైలు సిబ్బందికి సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న ఖాజాను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జైలర్‌ జి.రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు కుషాయిగూడ పోలీసులు తెలిపారు. తనకు బెయిల్‌ ఇప్పించేందుకు కుటుంబ సభ్యులు విముఖత వ్యక్తం చేయడం వల్లే అతను మనస్తాపానికి గురై.. ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. ఈ నెల 17న కూడా ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బానోతు శ్రీను నాయక్‌(32) అనే ఖైదీ బ్యారక్‌లో టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - 2021-07-25T08:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising