26న ఈశాన్య రుతు పవనాలు
ABN, First Publish Date - 2021-10-21T09:59:03+05:30
నైరుతి రుతుపవనాలు ఈనెల 23 తెలంగాణలోని మరి కొన్ని ప్రాంతాల నుంచి, తర్వాత మూడు రోజుల్లో..
హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ఈనెల 23 తెలంగాణలోని మరి కొన్ని ప్రాంతాల నుంచి, తర్వాత మూడు రోజుల్లో (26న) భారతదేశం నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె. నాగరత్న తెలిపారు. నైరుతి నిష్క్రమించగానే ఈనెల 26న ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కిందిస్థాయి గాలులు ఉత్తర దిశ నుంచి వీస్తున్నాయని, రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని డైరెక్టర్ తెలిపారు.
Updated Date - 2021-10-21T09:59:03+05:30 IST