రైళ్లలో వెయిటింగ్ లిస్టు ప్రయాణాలకు నో
ABN, First Publish Date - 2021-05-07T09:47:59+05:30
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం భారతీయ రైల్వే కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులను రైళ్లలో
ప్రీ పెయిడ్ కేటరింగ్ సౌకర్యం ఉండదు
హైదరాబాద్, మే 6(ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం భారతీయ రైల్వే కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులను రైళ్లలో ప్రయాణించడానికి అనుమతించొద్దని అన్ని జోన్లను ఆదేశించింది. జరిమానా వసూలు చేసి రైళ్లలో టికెట్లు ఇచ్చే విధానాన్ని కూడా నిలిపివేసింది. అయితే.. అన్రిజర్వుడు టికెట్లు ఉన్న ప్రయాణికులను అన్రిజర్వుడు కోచ్లు ఉన్న రైళ్లలోకి మాత్రమే అనుమతించాలని సూచించింది. టికెట్ చార్జీతో కలిపి భోజన రుసుము(ప్రీ పెయిడ్ కేటరింగ్)ను వసూలు చేసే సౌకర్యం ఉండబోదని తెలిపింది.
రెడీ టు ఈట్ భోజనం, ప్యాక్ చేసిన ఐటెమ్స్(వాటర్ బాటిళ్లతో కలిపి) మాత్రం రైళ్లలో అందుబాటులో ఉంటాయని వివరించింది. ఐఆర్సీటీసీ ద్వారా ఈ-కేటరింగ్ సౌకర్యం ఉంటుందని తెలిపింది. రైళ్లలో ప్రయాణికులకు లెనిన్ దుప్పట్లు, కర్టెన్లు ఇవ్వడం కుదరదని, వీటిని ప్రయాణికులు సొంతంగా తెచ్చుకోవాలని లేదా స్టేషన్లలోని స్టాళ్లలో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. థర్మల్ స్ర్కీనింగ్లో కొవిడ్ లక్షణాలు లేనట్లు తేలితేనే ప్రయాణాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది.
Updated Date - 2021-05-07T09:47:59+05:30 IST